logo

ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.*

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **కలెక్టరేట్** జనవరి 25 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

*ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.*


జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం (ఈరోజు) జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో బి ఎల్ ఓ లకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ తెలిపారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా బూత్ లెవెల్ అధికారులు రూపొందించిన అందమైన ముగ్గులు అందరి మన్ననలు పొందాయన్నారు.

అదేవిధంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చిన్న వయసులోనే ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని ఆయన ఈ సందర్భంగా అన్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓలు)కు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఎలక్టోరల్ అధికారులుగా ఎంపికైన తాసిల్దార్లు, జిల్లా మాస్టర్ ట్రైనర్ కు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ నిర్వహించారు.


జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహనను మరింత పెంచాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, తాసిల్దార్లు పుల్లయ్య, ధార ప్రసాద్, ఎన్నికల జిల్లా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు విద్యార్థులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

68
2024 views