
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - కొరిమిశెట్టి ఫౌండేషన్ ముత్యాల ముగ్గులు పోటీలు.....
తేదీ,11-01-2026,:శేరిలింగంపల్లి,చందానగర్:మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కాలనీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆదివారం ఆదర్శ్ నగర్ కాలనీ రోడ్డు నెంబరు 2లో మరియు బాలాజీ నగర్ శారదా హైస్కూల్ దగ్గర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవులు మాట్లాడుతూ " *పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు"* అని అన్నారు. " *ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. నేటి యువతరంకూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించేందుకై ఈ పోటీలు నిర్వహిస్తున్నాము"* అని అన్నారు. " *ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటాయి. గోమయంతో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమలు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమి కీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక భంగిమలలో పనిచేయవలసి ఉంటుంది. ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహిళలలో అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం మొత్తం నెలరోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝామున లేచి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు"* అని అన్నారు. ఈ పోటీలలో 25 + 25 మంది మహిళలు పాల్గొన్నారు. శ్రీమతి విజయలక్ష్మి శ్రీమతి కస్తూరి విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు శ్రీమతి రాణి, శ్రీమతి వరలక్ష్మి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, శ్రీమతి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.