logo

ఇరిగెల సోదరుల ఆధ్వర్యంలో 50 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరికలు.

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబాలూరు మజర అప్పనపల్లి,గోనం పల్లె గ్రామానికి చెందిన నల్లబోతుల పెద్ద పుల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మల్లయ్య, బాల మల్లయ్య, శీలం నర్సింహులు మరియు వారి అనుచర వర్గానికి చెందిన దాదాపు 50 కుటుంబాల వారు ఆళ్లగడ్డ తాలూకా జనసేన అధికార ప్రతినిధి యంత్రాంగం ఇరిగెల సోదరుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ అధికారప్రతినిధి ఇరిగెల సూర్య నారాయణరెడ్డి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ముందుగా ఇరిగెల సోదరులు గ్రామంలోనికి చేరుకోగానే మేళతాళాలతో పూల వర్షంతో వీర మహిళలు సైతం స్వాగతం పలుకుతూ స్వచ్ఛందంగా ఇరిగేలా బ్రదర్స్ నీ గ్రామంలోనికి ఆహ్వానించారు. పార్టీలోనికి చేరికలు అనంతరం ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ అధికారప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను,నియమానుసార అభివృద్ధి పరిపాలన నచ్చడంతో మా పై నమ్మకంతో స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరారని పార్టీలోకి చేరిన కుటుంబాలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.అలాగే త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి తాలూకాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రామచంద్రారెడ్డి, ఇరిగెల ప్రతాపరెడ్డి, ఇరిగేల సుధాకర్ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి,రంగస్వామి, రుద్రవరం మండలం నాయకులు నాగలింగమయ్య గౌడ్, తాలూకా జనసేన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాలు రత్నమయ్య, కౌన్సిలర్ గురుమూర్తి, మిద్దె రామ పుల్లయ్య,జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

87
3280 views