01-09-2026
పొదుపు సంఘాల సభ్యులకు శుభవార్త,*
📢 *పొదుపు సంఘాల సభ్యులకు శుభవార్త,*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల (SHGs) సభ్యులకు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
🔹 ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు
🔹 రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది
📊 సీఎం వెల్లడించిన ముఖ్యాంశాలు:
రాష్ట్రంలో 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల్లో ఉన్నారు పొదుపు సంఘాల ద్వారా ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నిధులు సమీకరించబడినట్లు తెలిపారు ఈ విజయానికి మహిళలను సీఎం అభినందించారు.