త్వరలోనే ఫాస్టర్ల ఖాతాల్లోకి పారితోషికాలు: విజయనగరం ఎంపీ వెల్లడి
క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి కూటమి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫాస్టర్లు, మౌజాంలకు ప్రభుత్వం ఇటీవలే పారితోషికాలను మంజూరు చేసిందని, అవి త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని వెల్లడించారు.