logo

మానవత్వం చాటుకున్న విశాఖపట్నం కి చెందిన దంపతులు...

దొరికిన లక్ష రూపాయలు నగదు బాధితులకు అందజేసిన దంపతులు రింతాడ గ్రామానికి చెందిన పిండి కృష్ణ,రవణమ్మ దంపతులు నర్సీపట్నం పనిమీద వచ్చి తిరుగు ప్రయాణంలో సా 6 గం||వారి వద్ద ఉన్న లక్ష రూపాయల నగదును నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు జారవిడుచుకున్నారు మరికొద్ది సేపటి తర్వాత తమ డబ్బులు పోయాయని గమనించి ఆర్టీసీ కాంప్లెక్స్ నందు బాధపడుతుంటే విశాఖపట్నం కి చెందిన బోయదాపు జగదీష్,భారతి దంపతులు నర్సీపట్నం చుట్టాలింటికి చుట్టపు చూపుగా వచ్చిన ఆ దంపతులు ఆ డబ్బులు తమకు దొరికాయంటూ తిరిగి అందజేశారు వంద రూపాయలు దొరికితేనే మాకు దొరకలేదంటూ మాట్లాడే ఈరోజుల్లో అంత సొమ్మును తిరిగి అందజేసి నందుకు అందరూ ఆ దంపతులను అభి నందించారు

0
90 views