గంజాయి రవాణా కేసులో వ్యక్తి అరెస్ట్
గంజాయి రవాణా కేసులో మూడో వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఒకటో పట్టణ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. 2023లో 18 కేజీల గంజాయిని సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రం కొరాపుట్ ప్రాంతానికి చెందిన 3వ ముద్దాయి గిరి అలియాస్ గిరి పొండేను అరెస్టు చేసి విజయనగరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు చెప్పారు. మేజిస్ట్రేట్ ముద్దాయికి 14 రోజుల రిమాండ్ విధించారని వెల్లడించారు.