logo

కార్యకర్తల రెక్కల కష్టంతో కట్టుకున్న పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన ఘనత నీది కదా

సోషల్ మీడియాలో *చిల్లర పోస్టులు,చిలిపి వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది ఈ రోజు మల్లెలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ ఓరుగంటి బిక్ష్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైనా,పార్టీ శాసనసభ్యుడిపైన,మా పార్టీ నాయకులపైన చవకబారు పోస్టులుపెడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ కట్టిన బడిలో చదివి కాంగ్రెస్ హయాంలో ఉద్యోగం పొంది కాంగ్రెస్ ఏం చేసిందని అడగటం విడ్డూరంగా ఉందన్నారు.
చదువుకున్న యువకుడివి కదా అని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు పంగనామాలు పెట్టిన నీచచరిత్ర నీది కదా
కార్యకర్తల రెక్కల కష్టంతో కట్టుకున్న పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన ఘనత నీది కదా
అంటూ మా శాసనసభ్యుని ఇంటిముందు రోడ్డు గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని ఎన్నికలకి ముందే రోడ్డు నిర్మిస్తుంటే ఎన్నికల కోడ్ అని చెప్పి పనులు ఆపించింది నువ్వు కదా అని ప్రశ్నించారు నువ్వు దమ్మున్న మొగోడివే కదా మరి పది సంవత్సరాల నీ హయాంలో మనుబోతులపాడు రోడ్డు
ఎందుకు వేయించలేకపోయావో తెలపాలన్నారు ఎన్నికల ముందు హడావుడిగా నువ్వు శిలాఫకాలు వేస్తే
నిధులు విడుదల చేయించి పనులు పూర్తిచేసిన ఘనత మా శాసనసభ్యుడిదన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలంలోనే పినపాకలో వందలకోట్లతో అభివృద్ధి పనులకోసం ఖర్చుచేశారన్నారు. నీ చవకబారు పోస్టులు ప్రజలు గమనిస్తున్నారని చెపుతూ 18 నెలల క్రితమే మీ కారు పార్టీకి,మీ రాజకీయానికి ప్రజలు పిండం పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, తుక్కాని మధుసూదన్ రెడ్డి, బేతం రామకృష్ణ, ఆవుల రవి, కారం శ్రీను, కొండాబత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, బచ్చు వెంకటరమణ, పద్దం నరసింహారావు, బారాసు సంపత్, చంచల రాము, హర్షా నాయక్, కోలా శశికాంత్, కుంజా జాను తదితరులు పాల్గొన్నారు...!!

17
1309 views