logo

పిల్లలకు మాదకద్రవ్యాల గురించి అవగాహన కల్పించాలి **సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు రమాదేవి

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** లక్ష్మీదేవి పల్లి మండలం **
(జూన్ 26) ఏఐఎంఏ మీడియా ప్రతినిధి

పిల్లలకు మాదక ద్రవ్యల గురించి ఆవగాహన కల్పించాలి

: సఖీ రమాదేవి

లక్ష్మిదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం లోని శ్రీ రామ చంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అంతర్జాతీయ మదకద్రవ్యల వ్యతిరేక దినోత్సవం ను పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవగాహన కార్యక్రమంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ప్రసంగిస్తు డ్రగ్స్ గురించి పాఠశాలల్లో పిల్లలకు పూర్తి స్థాయిలో ఆవగాహన కల్పించాలని, ఈ మాదకద్రవ్యల బాధితులు ఈ మథ్య కాలంలో ఎక్కువగా మైనర్ పిల్లలే ఉంటున్నారని, ఆభం శుభం తెలియని పసి పిల్లలకు చాక్లెట్ల రూపంలో ఈ డ్రగ్స్ కు అలవాటు చేస్తూన్నరని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు భాథ్యత గా ప్రతి బిడ్డ పై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా పిల్లలను ఈ మదకద్రవ్యల బారీ నుండి కాపాడుకునేందుకు ఆవకాశం ఉంటుందని తెలిపారు. సమాజంలో లో ఈ మాదకద్రవ్యల బాధితులను గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యల బాధితులకు రిహబిలేషన్ సెంటర్లో పూర్తి స్థాయిలో చికిత్సలు అందించి వారిని తిరిగి సామాన్య స్థితిలో తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఎన్నో సదుపాయాలు కల్పించాయని తెలియ చేశారు. మాదకద్రవ్యల భాదిత కుటుంబలు భయపడాల్సిన అవసరం లేదని, భాదితులకు మనోధైర్యం ఇచ్చి రిహబిలేషన్ సెంటర్ లో చేర్చాలని, డ్రగ్స్ రహిత భారత దేశాన్ని నిర్మించేందుకు ప్రతి పౌరుడు భాథ్యత గా పని చేయలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్ తులసి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భోదనేతర సిబ్బంది, విధ్యార్ధిని విధ్యార్ధులు పాల్గొన్నారు.

52
1834 views