పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైలు
పూరీ జగన్నాథ యాత్రకు ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ - పూరీ స్పెషల్ ఎక్స్ప్రెస్ (08313/314) జూన్ 27, జులై 5న విశాఖ నుంచి బయలుదేరుతుంది. జూన్ 28, జులై 6న పూరీ నుంచి తిరుగుపయనమౌతుంది. ఈ రైలుకు 4 స్లీపర్ క్లాస్ కోచ్లు, 6 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, ఒక దివ్యాంగ కోచ్, ఒక లగేజీ కోచ్ ఉండనున్నట్లు తెలిపారు.
ప్రయాణికులు గమనించాలన్నారు.