యోగాంధ్రతో రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరిగాయి: మంత్రి
విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని, గిన్నీస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడింపజేసిందన్నారు.