logo

స్కూటర్డి క్కీ లో దాచిన సిమ్ కార్డు, నగదు, బంగారు ఆభరణాలు దొంగలించిన.. అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్...!!

AIMA MEDIA :జూన్ 22:ఆదివారం :విశాఖపట్నం

న్యూస్ 9 :- విశాఖపట్నం జిల్లా నగర పరిధిలో కొన్ని దొంగ తనాలు చోటుచేసుకున్నాయి. 14-06-2025 తేది నాడు, పెందుర్తి అయాన్ పరీక్ష కేంద్రం వద్ద లలితా కుమారి అనే అమ్మాయి, పరీక్ష రాయిటకు సిద్ధం అవగా తను బైక్ డిక్కీ లో, సెల్ ఫోన్, 2000 నగదు, బంగారం, డిక్కీలో పెట్టి పరీక్ష రాయుటకు వెళ్ళిరు పరీక్ష ముగిసిన తర్వాత బైక్ డిక్కీ ఓపెన్ చెయ్యగా, ఆమె దాచుకొన్న సెల్ ఫోన్, నగదు, బంగారం దొంగలించి బడ్డాయి, ఈ విషయం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చెయ్యగా,.. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లా పరిధిలో పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి, జిల్లా పోలీస్ యంత్రాంగం దీనిపై కొన్ని పోలీస్ టీం లను పంపి ఈ కేసులు ను చిక్కు ముడి విడదీయాలి అనే ధోరణిలో, విశాఖపట్నం శిలానగర్ పరిధిలో అనుమానస్పాందంగా తిరుగుతూ ఉన్న ముగ్గురు వ్యక్తులు ను పట్టుకొని విచారణ చేయగా.. అసలు నిజం బయటపడింది.. అని సిటీ క్రైమ్ పోలీస్ అధికారులు తెలిపి వివరాలు లోకి వెళితే..పత్రికా ప్రకటన
డిక్కీ లో సిమ్ కార్డ్ లు దొంగతనాలకు పాల్పడతూ డబ్బులు దోచుకుంటున్న
ముగ్గురు అంతరాష్ట్ర నిందితుల అరెస్టు
వివరాలు:
తేదీ 14.06.2025న ఫిర్యాది డేగల లలిత, ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నని, ఆమె,, 14.10.2024న ION డిజిటల్ సెంటర్, షీలానగర్, గాజువాకలో A.P. TET పరీక్షకు హాజరైన సమయంలో, పరీక్షా కేంద్రం బయట తన స్కూటర్ డిక్కీలో విలువైన వస్తువులు ఉంచినట్లు తెలిపింది. అవి గుర్తు తెలియని దొంగలచే దొంగిలించబడ్డాయి. చోరీ అయిన వస్తువుల్లో బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డ్, సిమ్ కార్డ్ మరియు రూ.2,000 నగదు ఉన్నాయి. అనంతరం ఆమె సిమ్‌ను రీఆక్టివేట్ చేసినప్పుడు, తన బ్యాంక్ ఖాతా నుండి రూ.16,000 మోసపూరితంగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించింది. పోయిన మొత్తం సొత్తు రూ.43,000/-గా పేర్కొంది. పోలీసులను తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ మేరకు సిటీ పరిధిలో గాజువాక, పెందుర్తి, ఎయిర్పోర్టు, అరిలోవ పోలీస్ స్టేషన్ లలో డిక్కీ కేసులు నమోదు అవ్వడం తో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, శ్రీమతి కె. లతా మాధురి (DCP – క్రైమ్స్) మరియు శ్రీ మోహన్ రావు (ADCP – క్రైమ్స్) పర్యవేక్షణలో, శ్రీ డి. లక్ష్మణరావు (ACP – జోన్ 2), ఇన్స్పెక్టర్ శ్రీ కె. శ్రీనివాస్ రావు (సౌత్ సబ్ డివిజన్ – క్రైమ్) నేతృత్వంలో SI ఎ. మన్మధరావు మరియు PCs 3098, 3794, 3399, 3394 రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో షీలానగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా,
నిందితుడు గురించి సమాచారం:
ఏ1. ప్రిన్స్ కుమార్, S/o బిశ్వేస్వర్ సింగ్, వయస్సు 28 సంవత్సరాలు, R/o పంచశీల్ కాలనీ, స్ట్రీట్ నెం.1, సహిబబాద్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
ఏ2. క్రిషన్ S/o జైబిర్, వయస్సు 22 సంవత్సరాలు, R/o అంబేద్కర్ కాలని, కమల సినిమా హాల్ ఎదురుగా, విజయనగర, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
ఏ3. ధర్మేందర్ కుమార్ @ మొహిత్ S/o హరి సింగ్ లేట్, వయస్సు 31 సంవత్సరాలు, H.No.C-26, ఇంద్ర కాలనీ , మోహన్ నగర్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్

పోలీస్ క్రైం టీం ఉత్తమ దర్యాప్తు నైపుణ్యం చూపుతూ, నిందితుల సమాచారం సేకరించి, తేదీ. 20.06.2025 సాయంత్రం 18.30 గంటలకు ION డిజిటల్ సెంటర్ , షీలానగర్, గాజువాకలో ముగ్గురు వారు గతంలో వివిధ రాష్ట్రాలలో డిక్కీ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించబడింది.నిందుతులు ఒప్పంద ప్రకారం, ఈ క్రింద తెలిపిన కేసులలో మొత్తం రూ.5,08,500/- కాష్, 12 గిఫ్ట్ వౌచర్ విలువ 1,20,000/- మొత్తం సొత్తు 6,28,500మరియు మొబైలుస్ Redmi-02 , మోటోరోలా-01 , SIM కార్డ్స్ - 06 ను స్వాధీనం చేసుకున్నారు.



"S. No.
" "Name of the PS
" "Cr. No.
" "Sec. of law
" "Property lost worth
" "Property Recovered Description
"
"1
" "Gajuwaka
" "258/2025
" "303(2) BNS
" "43000
" "66000
"
"2
" "Penamaluru PS,
Krishna District
" "342/2025
" "303(2) BNS
" "74800
" "37500
"
"3
" "Pendurthy
" "283/2025
" "303(2) BNS
" "22700
" "14000
"
"4
" "Pendurthy
" "282/2025
" "303(2) BNS
" "304367
" "213000
"
"5
" "Arilova
" "240/2025
" "303(2) BNS
" "300000
" "210000
"
"6
" "Arilova
" "239/2025
" "303(2) BNS
" "45000
" "22000
"
"7
" "Arilova
" "245/2025
" "303(2) BNS
" "16000
" "9000
"
"8
" "Airport
" "112/2025
" "303(2) BNS
" "42000
" "28000
"
"9
" "Airport
" "111/2025
" "303(2) BNS
" "22000
" "13000
"
"10
" "Airport
" "110/2025
" "303(2) BNS
" "25800
" "16000
"
"
" "TOTAL
" "895667
" "628500
"


నిందితులు ముగ్గురు స్నేహితులు, చెడు అలవాట్లు మరియు లగ్జరీ జీవితానికి అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలని భావించి, డిక్కి నేరాలకు పాల్పడ్డారు.
విశాఖపట్నం పోలీసుల ప్రజలకి విజ్ఞప్తి:
దయచేసి ఏదయినా పరీక్షలు రాయబోతున్నవారికి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి.
పరీక్షకు వెళ్లే ముందు, మీ మొబైల్ ఫోన్లు, ATM కార్డులు, పర్సులు తదితర విలువైన వస్తువులను బైక్ కవర్ లేదా స్కూటీ డిక్కీలో ఉంచకండి. కొంతమంది దొంగలు, దొంగ తాళాలు ద్వారా డిక్కీని తెరిచి, మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న SIM కార్డ్‌ను తీసి, దానిని ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను OTP ద్వారా సేకరిస్తున్నారు.
దీని ద్వారా వారు మీ ఖాతాలో ఉన్న డబ్బును దొంగిలించగలుగుతున్నారు. అలాగే, ATM కార్డులు మరియు మనీ పర్సులు కూడా డిక్కీ లో లేదా బైక్ కవర్‌లో పెట్టడం చాలా ప్రమాదకరం.
ఈ సూచనలను పాటించడం ద్వారా మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును కొంతవరకు సురక్షితంగా ఉంచుకోవచ్చు.

11
2110 views