బాటసారులదాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలు
బాటసారులదాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలుకృష్ణా జిల్లా ప్రతినిధి, జూన్ 4 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్) మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ పోలీసువారి పెట్రోల్ బంకు వద్ద ఆకూరి శ్వేత ఏర్పాటు చేసిన చలివేంద్రం 75వ రోజు సందర్భంగా "ద్రాక్ష రసం" పంపిణి చేశారు* ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు మాట్లాడుతూ*మానవసేవే మాధవ సేవ అనిఆకూరి శ్వేత* చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు మజ్జిగ శీతల పానీయాలతో పాటు త్రాగునీరు అందించడం అభినందనీయమని గడ్డం రాజు తెలిపారుకూటమి ప్రభుత్వంవేసవిని పురస్కరించుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేశాయని దాతలు స్వచ్ఛందంగా రహదారుల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, తాగునీరు, శీతల పానీయాలు పంపిణీ చేస్తున్నారని గడ్డంరాజు పేర్కొన్నారువేసవి నుండి జీవకోటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనిమూగజీవాలకు *నీటి తొట్టెల ఏర్పాటుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నిధులు విడుదల చేసిన విషయంవిధితమేననిఅన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్టెలు నిర్మాణం చేసి పశుపక్షాదులకు ఈ నీటి తొట్టెల ద్వారా దాహార్తి తీరుస్తున్నారని అన్నారువేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్న కారణంగా వృద్ధులు పిల్లలు బయటకు రాకపోవడం మంచిదని తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లేటప్పుడువేసవి నుండి రక్షణ కొరకుతగు జాగ్రత్తలు తీసుకుంటూ రక్షణ కవచాలు వాడాలనితెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పలనియప్ప రెడ్డి కోటి, యడ్ల పల్లీతిరు నాగ గణేశ్ సునీల్,రియాజ*తదితరులు పాల్గొన్నారు.