నేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయాలి
శ్రీకాకుళం: మగ్గమున్న ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు నక్కిన అసిరప్పడు డిమాండ్చేశారు. మంగళవారం లావేరులో పర్యటించి చేనేత కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు గిట్టుబాటు ధరలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ చేసి ఆప్కో ద్వారా ప్రభుత్వం వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం పథకం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయుకులు కె.శంకరరావు, కె.రామారావు, యు.గంగరాజు, కె.గంగరాజు, భద్రకాళీ, బి.వెంకటరావు, యు.కాశీవిశ్వేశ్వరరావు, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.