logo

విద్యాహక్కు చట్టం కింద 25 వేల సీట్లు భర్తీ..కేసలి అప్పారావు



రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన
25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద
ఉచితంగా ప్రవేశాలు కల్పించినట్లు రాష్ట్ర బాలల హక్కుల
కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో
తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా
వారికి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా
ప్రవేశాలు కల్పించాలన్నారు. ప్రవేశాలపై ఇబ్బందులు
ఎదుర్కొంటే apscpcr2018@gmail.comకు
ఫిర్యాదు చేయాలని సూచించారు.

4
1064 views