logo

తెలంగాణ స్టేట్ ::ఖమ్మం జిల్లా:: మే 6:

తెలంగాణ స్టేట్ ::ఖమ్మం జిల్లా:: మే 6:

* పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం

*ఖమ్మం:* తనను బలపరిచిన వామపక్ష పార్టీల్లో సీపీఐ ఒకటి కాగా.. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి సోమవారం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి.. అక్కడి నాయకులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ పార్టీ రాష్ట్ర నేత బాగం హేమంతరావు, జిల్లా బాధ్యులు పోటు ప్రసాద్, మహమ్మద్ మౌలానలతో కలిసి శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వామపక్షాల మద్దతు ఎంతో గొప్పదని అన్నారు. బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ప్రజాసేవ చేయడానికి పోటీ చేసిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీపీఐ నాయకులు మహమ్మద్ సలాం, జానీ పాషా, క్లైమెంట్ తదితరులు పాల్గొన్నారు.

0
132 views