నెల్లిమర్లలో బడ్డుకొండ అనకొండగా మారారు: చంద్రబాబు
డెంకాడ మండలంలో జరిగిన బహిరంగ సభలో
చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో రూ.500 కోట్లతో
విలాసవంతమైన భవనం కట్టుకున్న సీఎం ప్రజలకు సెంట్
భూమి ఇచ్చాడంటా అంటూ ఎద్దేవా చేశారు. జగన్
రుషి కొండని మింగేస్తే బడ్డుకొండ అప్పలనాయుడు,
నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ
అన్నారు. తంగుడుబిల్లిలో సుమారు 10 ఎకరాల
కొండని అనుచరులతో అక్రమంగా తవ్వేశారని అన్నారు.