logo

గాజులరేగ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న జనసేన నేత గురాన అయ్యలు...



విజయనగరం : గాజులరేగ ముత్యాలమ్మ తల్లి , పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని జనసేన నేత గురాన అయ్యలు అభిలషించారు . మంగళవారం నాడు గాజులరేగలో వేంచేసియున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి 71వ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారినీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వీరికి సాధర స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. కమిటీ నిర్వాహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

12
908 views