logo

కేంద్రానివి పథకాలు.. రాష్ట్రానివి గొప్పలు: అరకు ఎంపీ అభ్యర్థి


కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం
ఇస్తున్నట్టుగా వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని అరకు
పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత
విమర్శించారు. గురువారం గరుగుబిల్లి మండలం
ఎర్రన్న గుడి నుంచి గిజబ వరకు భారీ ర్యాలీని
నిర్వహించారు. అనంతరం గిజబలో జరిగిన సభలో
ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కురుపాం
నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక
జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

0
0 views