కామారెడ్డి ప్రతినిధి తేది:01.04.2026
కామారెడ్డి జిల్లా బుధవారం..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఆధ్వర్యంలో, “మన ఇసుక, మన వాహనం” ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్థానిక అవసరాలకు,c ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ఇసుక కోసం దరఖాస్తులు స్వీకరించడానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించడం జరిగింది... ఈ కార్యక్రమం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో, తాసిల్దారులు, ఆర్ డి ఓలు, సబ్ కలెక్టర్లు, ఏడీఎం జీ (ADM G), ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
1 ఏప్రిల్ 2026 నుండి, ఇసుక కావలసిన వినియోగదారులు కేవలం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సరైన అనుమతులు పొందిన వినియోగదారులకే ఇసుకను సరఫరా చేస్తారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కొత్త పద్ధతి ద్వారా ఇసుక సరఫరా మరింత పారదర్శకంగా, సమయ పూర్వకంగా జరుగుతుందని పేర్కొన్నారు. .. ఈ సందర్భంగా AD మైన్స్ శాఖ ద్వారా PPT పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ ఎలా చేయాలో అవగాహన కల్పించారు . ... ఈ శిక్షణ లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, ఆయా మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.