logo

ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి. జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి.

విజయనగరం: ఆగస్టు 10 మంగళవారం జిల్లా లోని ఉపాధ్యాయులందరికీ కోవిద్ వ్యాక్సి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం లో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల తో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు శతశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ కావలసినవారు జిల్లాలోని ఏ పి హెచ్ సి కి వెళ్ళిన వ్యాక్సినేషన్ వేసుకోవచ్చని సూచించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాల కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్: 08922275279-0892227950 లకు సంప్రదించవచ్చు నని సూచించారు. ఈ సమావేశంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ ఎస్ వి. రమణ కుమారి, డి ఈ ఓ జి .నాగమణి తదితరులు పాల్గొన్నారు.

9
14692 views
  
11 shares