ప్రజా సమస్యల పరిష్కారానికై స్పందన కార్యక్రమం.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పి ఎం దీపికా పాటిల్ ఐపీఎస్ స్పందన కార్యక్రమాన్ని ఆగస్టు 9 సోమవారం నిర్వహించి, ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారు లకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సత్యనారాయణ రావు, సిఐలు బి. వెంకటరావు, జి రాంబాబు , ఎన్ శ్రీనివాసరావు, రుద్ర శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.