పాత కొట్నాబెల్లీ గిరిజనులు వి బి జి రాంజీ పథక సమస్యలపై ధర్నా
అనకాపల్లి జిల్లా.రావికమతం మండలం పాత కొట్నాబెల్లీలో 70 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. మార్చి 12, 2026న ఈ గ్రామస్తులు VBG రాంజీ (వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ) పథకంలో ఫేస్ యాప్ రికగ్నిషన్ కోసం సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ధర్నా నిర్వహించారు. రామన్న దొరపాలెం, కె. కొట్నాబెల్లీ, కె. గదభపాలెం గ్రామాల్లో కూడా అదే సమస్య ఉందని, రేషన్ బియ్యం తీసుకోవడానికి సగం కిలోమీటరు వెళ్లి ఫింగర్ ప్రింట్ వేయాల్సి వస్తోందని, అంగన్వాడి పిల్లలు ఫేస్ వెరిఫికేషన్ కోసం దూరం నడవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆఫ్లైన్ మాస్టర్ రిజిస్ట్రేషన్ ఉండేది కానీ, ఇప్పుడు సిగ్నల్ ఆధారంగా ఫేస్ యాప్ ద్వారా చేయాల్సి ఉంది. గ్రామసచివాలయం 7 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. అజ్జపురం గ్రామసచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో కుల, జన్మ తేదీ సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్ అప్డేట్లు పెండింగ్లో చిక్కుకున్నాయి. అదనంగా, గ్రామంలో 24 గంటలు కరెంట్ లైట్లు వెలుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆఫ్ స్విచ్ లేకపోవడంతో ప్రమాదాల సమయంలో అజ్జపురం వరకు వెళ్లి ఆఫ్ చేయాల్సి వస్తోంది. గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను దయ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.గ్రామస్తులు ముఖ్య డిమాండ్లుగా సిగ్నల్ లేని గ్రామాలకు VBG రాంజీ పథకంలో మినహాయింపు ఇవ్వాలని, సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని, అజ్జపురం గ్రామసచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్టును తక్షణం భర్తీ చేయాలని, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆఫ్ స్విచ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె. గోవిందరావు, పాడి బెన్నయ్య, ఎస్. వలసయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారులు త్వరలో సానుకూల స్పందన ఇవ్వాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.