logo

పత్రిక ప్రకటన తేది:27.09.2024 అదిలాబాద్ జిల్లా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం లోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి క్లాస్ రూమ్ లను పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటిస్తు పాఠశాల అధ్యాపకుల ప్రవర్తన, బోధనా విధానం, హాస్టల్ వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ రూమ్ లు, వంటశాల, టాయిలెట్స్ లను పరిశీలించారు.

బాలికలు, మహిళలకు సమస్యలు వస్తే మహిళా కమీషన్ దృష్టికి ఎలా తీసుకురావా లో అవగాహన కల్పించేలా చైర్ పర్సన్ నేరెళ్ళ శారద విద్యార్థినీ లకు పలు సూచనలు చేశారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్న ఉపాధ్యాయులను చైర్ పర్సన్ శారద అభినందించారు. సమస్యల పై ఫిర్యాదు చేయడం కోసం మహిళా కమీషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9490555533 ను విద్యార్థులకు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ సభ్యురాలు ఈశ్వరి భాయి, సిబ్బంది పాల్గొన్నారు.

0
84 views