logo

ప్రభుత్వ పాఠాశాలలను సందర్శించిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటిస్తూ సమస్యలు తెలుసుకొని రూ. 5 లక్షలతో కేజీబివి పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ


*నేను కూడా ప్రభుత్వ పాఠశాల బిడ్డనే
హాస్టల్లో చదివి ఎమ్మెల్యే అయ్యాను*

ఈరోజు బోథ్ మండల కేంద్రంలో గల కేజీబివి మరియు మోడల్ పాఠశాలలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంట గదిని పరిశీలించారు. విద్యార్థిలకు అడిగి నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా కేజీబివి పాఠశాలలో రూ. 5 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తరగతి గదులలో తిరిగి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఉపద్యాయులతో మాట్లాడి పాఠశాలలో గల సమస్యలను వసతుల గురించి తెలుసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన తొందరగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలకు చేరుకోవలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పాఠశాలకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారికి పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. వీరి వెంట నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0
157 views