logo

ఆరోగ్యశ్రీ ఆసుపత్రి తనిఖీ


విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో
ఎన్టీఆర్ వైద్య సేవల విభాగాన్ని జిల్లా మేనేజర్ రాంబాబు
గురువారం పరిశీలించారు. వైద్యమిత్ర హాజరు,
రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా
వసూలు చేయకుండా, ఉచిత చికిత్స అందించేలా
చూడాలని వైద్యమిత్రాను ఆదేశించారు. రోగులకు
అందించే భోజనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. ఈ
కార్యక్రమంలో వైద్యమిత్ర పాల్గొన్నారు.

1
1126 views