logo
अपने विचार लिखें....

ఘనంగా లోక్ సత్తా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


విజయనగరం
లోక్ సత్తా పార్టీ 17వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు బేసెట్టి బాజ్జీ పార్టీ జెండా ఎగురవేశారు.
ఆయన మాట్లాడుతూ.. వ్యాపారాలు, వారసత్వం
కోసం కాకుండా ప్రజా సంక్షేమమే ఎజెండాగా పుట్టిన
పార్టీ లోక్ సత్తా అన్నారు. అధికారం కోసం అర్రులు చాచే
అలవాటు తమకు లేదని, ప్రజల కోసం పోరాడటమే
తమ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు
పాల్గొన్నారు.

15
2026 views
  
1 shares