logo

మారి టైం బోర్డు చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఎంఎల్ఎ కోలగట్ల వీరభద్రస్వామి.

ఆగస్ట్ 10 బుధవారం నాడు విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయనగర నియోజకవర్గ శాసనసభ్యుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మారిటైం చైర్మన్ వెంకటరెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ. మారిటైం చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి నియమితులు కావడం తనకు వ్యక్తిగతంగా సంతోషంగాా ఉందన్నారు. జిల్లా కోటాలో సమర్థవంతుడైన నాయకునికి పదవి ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. . ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ రాజకీయంగా వైయస్సార్ పార్టీ ని మరింత పటిష్టవంతం చేయాలని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ పదవికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ కొత్త పోర్టులు వచ్చే విధంగా కృషి చేస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. ఈ సందర్భంగా మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి జిల్లా ఎమ్మెల్యే కోలగట్ల ను ఉచిత రీతిని సత్కరించారు.

0
14669 views
  
1 shares