logo

ఏసీబీ వలలో చిక్కిన కొత్తవలస ఎస్సై నరసింహమూర్తి.

విజయనగరం: కొత్తవలస మండలం, పాత సుంకర వాని పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బి వి. రాము ఓ మహిళను వేధిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. రాముకి స్టేషన్ బెయిలు నిమిత్తము 30,000/- రూపాయల నగదును కొత్తవలస స్టేషన్ ఎస్ఐ ఆర్. నరసింహ మూర్తి డిమాండ్ చేశారు. మొదట 15,000/- రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మిగతా 15,000/- రూపాయల నగదును ఆగస్టు 4 బుధవారం నాడు తీసుకుంటుండగా విజయనగరం ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

0
14678 views