logo

పెందుర్తి న్యూస్ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహిత మిత్ర పెందుర్తి గ్రూప్ ఈరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప

పెందుర్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహిత మిత్ర పెందుర్తి గ్రూప్ ఈరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురోహితుల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అని బ్రాహ్మణ సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి అన్నది కార్యచరణ మీటింగు ఈరోజు విజయ్ కుమార్ శర్మ గారు. కైలాసపతి శివాచార్య. శివ గణేష్ శర్మ గారు. పూర్ణ సాయి కిషోర్ శర్మ. సురేష్ శర్మ. రాజేష్ కుమార్ శర్మ గారు జయప్రదంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ కోపరేటివ్ సొసైటీ గుర్తింపు కార్డులను తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నీ బలోపేతం చేయాలని తెలియజేశారు. సుమారు వందమంది పురోహితులు వచ్చి వారి వారి సమస్యల్ని తెలియజేయడం జరిగింది వీలైనంత త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్ సీతంరాజు సుధాకర్ గారికి తెలియజేసి పరిష్కారం చేస్తామని తెలియజేశారు.

377
14689 views